- వన మహోత్సవం కార్యక్రమం
- అర్జున్ సమాచారం బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 25
- నెన్నెల గ్రామ సర్పంచ్ ఎండి ఇబ్రహీం ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం మరియు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేశారు. మొక్కలను నాటుదాం – పర్యావరణాన్ని కాపాడుదాం – భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందిద్దాం” అనే సందేశంతో వన మహోత్సవ నిర్వహించడం జరిగింది.
*ఈ కార్యక్రమానికి ఎమ్మార్వో శ్రీనివాస్ , ఎంపీడీవో పూర్ణచంద్రరావు , డి ఆర్ ఓ దయాకర్ , ఎంపీ ఓ శ్రీనివాస్ , ఎఫ్ ఆర్ ఓ.ప్రవీణ్ , ఏపీవో .నరేష్ , ఈసీ స్వామి , ఎస్ ఓ కవిత , పంచాయతీ కార్యదర్శి సురేష్ , వార్డు సభ్యులు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
*ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి వివిధ రకాల మొక్కలను నాటారు*ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.